
గోదారి ముంచటం చూసినం/ గోదాట్లో ముంచడం కొత్త కథ’ తెలంగాణను అభివృద్ధికి దూరం చేస్తున్న పరిణామాలపై హనీఫ్ ఆవేదన ఇది (అడవీ, అంబులపొది). ఇది కాకుండా శవాల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి తెలంగాణలో విషాదం. అన్నలో, అయ్యలో, లేకపోతే దుబాయిలో మరణించిన వారో – ఒక సంక్షోభం నుంచి విముక్తం కావాలనుకున్నవారంతా శవాలై గ్రామాలకు చేరడం గురించి వి.ఆర్.శర్మ (ఇంకారాని శవాలు) రాసిన కవిత ఈ 55 కలాల సంకలనంలో చాలాకాలం గుర్తుంటుంది. చక్కని ముఖచిత్రం, కవితలకు వేయించిన ముచ్చటయిన చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.
తెలంగాణ కవిత (2006),
సం. సుంకరి రమేశ్, అన్వర్, ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలలో
పేజీలు 116
వెల రూ 50
(4-11-2007 ఆదివారం ఆంధ్రజ్యోతి నుండి)

No comments yet
ఈ టపాకి వ్యాఖ్యల ఫీడు