tel-kavita.jpg

గోదారి ముంచటం చూసినం/ గోదాట్లో ముంచడం కొత్త కథ’ తెలంగాణను అభివృద్ధికి దూరం చేస్తున్న పరిణామాలపై హనీఫ్‌ ఆవేదన ఇది (అడవీ, అంబులపొది). ఇది కాకుండా శవాల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి తెలంగాణలో విషాదం. అన్నలో, అయ్యలో, లేకపోతే దుబాయిలో మరణించిన వారో – ఒక సంక్షోభం నుంచి విముక్తం కావాలనుకున్నవారంతా శవాలై గ్రామాలకు చేరడం గురించి వి.ఆర్‌.శర్మ (ఇంకారాని శవాలు) రాసిన కవిత ఈ 55 కలాల సంకలనంలో చాలాకాలం గుర్తుంటుంది. చక్కని ముఖచిత్రం, కవితలకు వేయించిన ముచ్చటయిన చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ.

తెలంగాణ కవిత (2006),

సం. సుంకరి రమేశ్‌, అన్వర్‌, ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాలలో

పేజీలు 116

వెల రూ 50

(4-11-2007 ఆదివారం ఆంధ్రజ్యోతి నుండి)